కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు 2025


పుష్కరాలు అంటేనే ఓ పవిత్రమైన సమయం. నదీ స్నానం చేసి పునీతులయ్యే పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగ. ఈసారి సరస్వతీ మాతకు పుష్కరాలు వచ్చాయి. మరి ఎంతోమంది నమ్మకం ప్రకారం, గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కొలువైన కాళేశ్వరం, ఈసారి సరస్వతీ పుష్కరాలకు ప్రధాన వేదిక అయ్యింది.
పుష్కరాలు అంటే ఏమిటి?
 ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి ఇలాంటి ఓ పవిత్రమైన సమయం వస్తుందని. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురుడు (బృహస్పతి) ఏ రాశిలో ఉంటే, ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయిట. ప్రతి 12 ఏళ్లకోసారి గురుడు అన్ని రాశులు తిరుగుతాడు కాబట్టి, ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి.
మరి 2025లో గురుడు మిధున రాశిలోకి వచ్చాదు.మిధున రాశికి సరస్వతీ నది కేటాయించబడిందని అంటారు. అందుకే 2025లో సరస్వతీ నదికి పుష్కరాలు! సాధారణంగా ఈ పుష్కర కాలం 12 రోజులు ఉంటుంది. మొదటి 12 రోజులు ‘ఆది పుష్కరాలు’ అంటారు, ఈ రోజుల్లో స్నానం చేస్తే విశేష పుణ్యం అని అంటారు. ఈసారి సరస్వతీ మాత పుష్కరాలు కాబట్టి, కాళేశ్వరం లాంటి క్షేత్రాల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.
కాళేశ్వరం – ఆ నదీ తీరానికి వెళితే ఆ ప్రశాంతతే వేరు!
 హైదరాబాద్ నుండి కొంచెం దూరం ప్రయాణమైనా, ఒక్కసారి ఆ గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోటుకి వెళ్తే, మనసుకి ఏదో తెలియని ప్రశాంతత దొరుకుతుంది. ఆ వాతావరణం, ఆ నదీ గలగలలు మనలోని అలసటని, ఆందోళనని దూరం చేస్తాయి.
మనందరికీ తెలుసు, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. అయితే, ఇక్కడి స్థలపురాణం ప్రకారం, మన పూర్వీకుల నమ్మకం ప్రకారం, మన కంటికి కనపడకుండా, భూగర్భంలో సరస్వతీ నది కూడా ఇక్కడే ప్రవహిస్తుందని అంటారు. అందుకే ఈ ప్రదేశాన్ని ‘త్రివేణి సంగమం’ అని పిలుస్తారు. నిజంగానే, పవిత్ర నదులన్నీ కలిసే చోటుకి వెళ్తే ఆ అనుభూతే వేరు కదా!
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం: అద్భుతం, అద్భుతం!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top