10-09-2024 ఒరిస్సా,కామాఖ్య వస్తున్న యాత్రికులందరికి స్వాగతం.సుస్వాగతం.. రవీందర్.శ్రీటూర్స్. 8985246542. ఈ యాత్రకు 17గురు యాత్రికులం వెలుతున్నాం. ట్రైన్ రిజర్వేషన్ అందుబాటు బట్టి గతంలో ఇదే యాత్రకు 20 నుండి 50 మంది వరకు వెళ్ళాము(దిగువ సూచనల్లో ఎక్కడైనా పొరపాటున వేరే డేట్స్ కనపడితే అది 10-9-24 యాత్ర సూచనలుగానే భావించండి.ఎందుకంటే పాత యాత్ర సూచనలనే డేట్స్ మార్చి పెడుతుంటాము.)

*****యాత్రలో దర్శించే క్షేత్రాలు.*****

1) ఒరిస్సా: పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం,గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) 

2) వెస్ట్ బెంగాళ్ లో :  కలకత్తా కాళిక మందిరం (రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధి హౌరా బ్రిడ్జి.(రన్నింగ్ లో మాత్రమే)

3) అస్సాంలో : గౌహతి –  కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం,బ్రహ్మపుత్ర నధి .

4)  జార్కండ్ :  భైద్యనాధ్ జ్యోతిర్లింగం.

5) 1 రోజు భూటాన్ దేశం-విజిట్.పూన్ షోలింగ్ టౌన్ 2 బుధ్ద టెంపుల్స్,షాపింగ్.(భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు (కలర్ జిరాక్స్ తీసిన ఆధార్ కార్డు కాదు ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే చెల్లుతుంది)+ఒరిజినల్ ఓటర్ ఐ.డి.కార్డు స్టిక్కర్ (ఎంబ్లం ఉన్న)  కంపల్సరి చాలు ,పాస్ పోర్టు  ఉంటే తెచ్చుకోండి నిరభ్యంతరంగా వెళ్ళవచ్చును(పోయిన నెల వెళ్ళి నప్పుడు  యాత్రికులు కొందరు తెచ్చిన ఆధార్  కార్డు ఒరిజినల్ కాదని(కలర్ జిరాక్స్ తెచ్చారు .) ఓటర్ ఐ.డి.కార్డు సరిగా లేదని 5గురిని రానివ్వలేదు.అందుకే మీదగ్గరున్న అన్ని ఒరిజినల్స్(ఆధార్,ఓటర్,పాస్ పోర్టు ) తప్పకుండా తెచ్చుకోండి.వాటిని ప్లాస్టిక్ కవర్స్ లో జాగ్రత్తగా పెట్టుకోండి.

సికింద్రాబాదు నుండి ఉదయం 8గంటలకు10-9-24న బయలుదేరితే (1వ రోజు ట్రైన్ ప్రయాణం) వరుసగా రాష్ట్రం వారిగా ముందుగా ఒరిస్సా (2వరోజు), వెస్ట్ బెంగాల్ కలకత్తా (3వ రోజు),భూటాన్(4వ రోజు) అస్సాం -కామాఖ్య,(5వ రోజు) గౌహతి టూ బైధ్యనాధ్ ట్రైన్ ప్రయాణం(6వరోజు) జార్కండ్-భైధ్యానాధ్  జ్యోతిర్లింగం(7వ రోజు) లు దర్శించి చివరగా జార్కండ్ భైధ్యానాద్ నుండి,ఫ్లైట్ ద్వారా(7వరోజు-16-9-24) బై ట్రైన్ ద్వారా (8వరోజు 17-9-24న రాత్రి 8గంటలకు ) సికింద్రాబాదుకు రిటర్న్ వస్తాము.

******ముఖ్య గమనిక*** ట్రైన్,ఫ్లైట్ టికెట్స్ అన్ని ఒకేరోజు పెడితే కనఫ్యూజన్ గా ఉంటాయి కాబట్టి ఏరోజు టికెట్స్ ఆరోజే వరుసగా పెడుతానని గమనించగలరు.

*3 రాత్రులు హోటల్ రూం నైట్ స్టేస్ @ భువనేశ్వర్,హషిమార,గౌహతి, (3 రాత్రుల్లో ఎ.సి.రూం చార్జి  ఒక్కరికి రూ.1500 అదనం ) సింగిల్స్ వచ్చిన్నప్పుడు ఇతర సింగిల్స్ లేకుంటే సింగిల్ పర్సన్ రూం కోసం రూ.2000 అదనం.నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం(బైధ్యనాధ్ లో రూ.150)డ్రైవర్ టిప్ అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కరికి రూ.100 ఇవ్వవలెను.

పెండింగ్ బ్యెలెన్స్ లు అందరు ఖచ్చితంగా బై క్యాష్ గానే యాత్రలో పేచేయవలెను .

ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

ముఖ్య గమనిక * అస్సాం కామాఖ్యలో ఉచిత దర్శనం 8గంటలు పడుతుంది. ప్రత్యేక స్పెషల్ వి.ఐ.పి దర్శనం రూ.1000 సుమారు ఉంటుంది, అలాగే బైధ్యనాధ్ లో స్పెషల్ దర్శనం రూ.250 ఉంటుంది. క్యాష్ గానే వీటికి డబ్బులు ముందుగానే హైదరాబాదులో బయలుదేరేప్పుడే పెట్టుకోగలరు) 

*1)***ట్రైన్ ద్వారా 16-7-24 వచ్చేవారికి సూచనలు****

ట్రైన్ ద్వారా బయలుదేరేవారు సెప్టెంబర్ 10 న ఉదయం 8గంటలకల్లా ఖచ్చితంగా సికింద్రాబాదు రైల్వేస్టేషన్ కు చేరుకొవాలి. మనం వెళ్ళాల్సిన ట్రైన్ పేరు,ట్రైన్ నెంబర్. East Cost Express , Train no. 18046.  స్టేషన్ కు వచ్చాక వచ్చామని నానెంబర్ కు (8985246542) ఒక కాల్ మాత్రం చేస్తే సరిపోతుంది. దయ చేసి గమనించండి స్టేషన్ కు వచ్చాక మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఎక్కడికి రావాలి అనే ప్రశ్నలు ఫోన్ లోఅడిగితే సమాధానం చెప్పడం కష్టం,ఒకిరికి ఒకరు వెతుక్కోవడమే సరిపోతుంది.ఇది కరెక్ట్ కాదు. అంతా ఒక దగ్గర కలియడం అనేది ఉండదు.ట్రైన్ లో ఎక్కడమే అందరం చేయాల్సిన పని.ఉదయం స్టేషన్ లో గోల గోలగా ఫోన్లో ఒకరు చెప్పేది ఒకిరికి వినపడకుండా ఉంటుంది.మీరు స్టేసన్ కు వచ్చాక ఒక ఫోన్ చేసి, ట్రైన్ ఏ ఫ్లాట్ ఫాంమీదకు వస్తుందో డిస్ ప్లే బోర్డు మీద చూసుకుని మీమీ భోగీలు,బెర్త్ దగ్గరకు మీ స్వంత బాధ్యత మీద  ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ లో ఎక్కాక నేను మీకు కలుస్తాను. ట్రైన్ టికెట్స్ కాని, ఫ్లైట్ టికెట్స్ కాని ఏ ఒక్కిరికి ప్రింటెడ్ టికెట్స్ అవసరంలేదు. వాట్సప్ గ్రూపులో మొబైల్ లో ఉన్న టికెట్స్ చూపిస్తే సరిపోతుంది. మర్నాడు ఉదయం 5గంటలకు భువనేశ్వర్ రైల్వేస్టేషన్ లో దిగుతాం. సికింద్రాబాదులో ట్రైన్ ఏ ఫ్లాట్ ఫాంకు వస్తుంది అనే విషయం నుండి మొదలు భువనేశ్వర్ రావడానికి 20 నిమిషాల ముందే మన వాట్సప్ గ్రూపులో అప్ డేట్ చేస్తాను.మర్నాడు ఉదయం 4.40 కల్లా లేచి టూత్ బ్రషింగ్ ,కాలక్రుత్యాలు తీర్చుకుని 5గంటలకు భువనేశ్వర్ లో దిగడానికి రెడిగా ఉండాలి.హోటల్ రూం చెకిన్ టైం అసలైతే ఉదయం 11గంలకు కాని అదనం పేమెంట్ చేసిన కారణంగా మనకు ఉదయం 6గంటలనుండి హోటల్ రూంలోకి చెకిన్ కావడానికి అనుమతిస్తారు.భువనేశ్వర్ లో ట్రైన్ దిగినప్పుడు మీరు ఏ భోగిలో దిగిన కూడా ట్రైన్ ఇంజన్ వైపు వెళ్ళాలి(ట్రైన్ కలకత్తా వైపు వెలుతుంది).అక్కడ చివరి ఫుట్ ఓవర్ బ్రిడ్జికి చేరుకొని లిఫ్ట్ లో ఎక్కి 1వ నెంబర్ ఫ్లాట్ ఫాం బయటకు దిగాలి.(1వ నెంబర్లో కాదు స్టేషన్ బయటకు.. ఎస్కలేటర్ లేదా , మెట్లు స్టేషన్ బయట వెళ్ళడానికి ఉంటాయి) అక్కడినుండి కేవలం 300 గజాల నడక దూరంలో మన హోటల్ ఉంటుంది

 (Hotel Name-Royal Delmon, Beside Kalyan Jewellers) హోటల్ రూంకు చేరుకోగానే అందరు ఆధార్ జిరాక్స్ కాపి నాకు ఇచ్చి మీ మీ రూంలకు ప్రెషప్ స్నానం చేయడానికి వెళ్ళాలి. లగేజి రూంలోనే ఉంచి 40 నిమిషాల్లో అంతా స్నానం చేసి హోటల్ కిందకు రావాలి. అక్కడే టిఫిన్,టీ తాగేసరికి మన వెహికిల్ అక్కడ రెడిగా ఉంటుంది.టిఫిన్ చేసి వెంటనే పూరి జగన్నాధ్ వెళుతాం.ట్రైన్ లో మొదటి రోజు తినడానికి హోంఫుడ్ తెచ్చుకోండి. మర్నాడు భువనేశ్వర్ లో దిగిన తరువాత నుండి మళ్ళి రిటర్న్ లో భైద్యనాధ్ లో ట్రైన్ లేదా ఫ్లైట్ ఎక్కే ముందు లంచ్ వరకు మా తరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉంటుంది.అప్ డౌన్ ట్రైన్స్ లలో మీరు అరెంజ్ చేసుకోవాలి.  

3)**అందరు వెంట తెచ్చు కోవాల్సిన డాక్యుమెంట్స్…

..ఎ) అందరు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు+ఖచ్చితంగా 3 ఆధార్ జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి.జిరాక్స్ కాపీలు హోటల్ రూంలలలో ఖచ్చితంగా ఇవ్వాలి.హైదరాబాదులో బయలుదేరినప్పుడే ఆధార్ కు 3 జిరాక్స్ కాపీలు తప్పకుండా తీసుకుని బయలుదేరాలి.అక్కడికి పోయాక తీసుకుందాం అంటే వీలుకాదు,పొద్దున్నే షాపులు తీయరు.

బి) భూటాన్ లో ఎంట్రికోసం ఆధార్ ఒరిజినల్ తో పాటు ఖచ్చితంగా ఓటర్ ఐ.డికార్డు ఒరిజినల్ లేదా పాస్ పోర్టు ఒరిజినల్ తెచ్చుకొండి.4 నెలలుగా ఆధార్ ఒరిజినల్ ఉంటే భూటాన్ లో అనుమతిస్తున్నారు.కాని  పోయినసారి వెళ్ళినప్పుడు ఆధార్ ఒరిజినల్ కార్డులోని క్యూ.ఆర్.కోడ్ ను స్కాన్  చేస్తే కొందరివి స్కాన్ కాక ఎంట్రి దగ్గరే అపారు.మీ మీ అధార్ కార్డుల మీద క్యూ.ఆర్ కోడ్ సరిగా లేకుంటే భూటాన్ లోకి అనుమతించరు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే ఆధార్ ఒరిజనల్ తోపాటు ఓటర్ కార్డు ఒరిజినల్ కాని పాస్ పోర్టు ఒరిజినల్ కాని తెచ్చుకోండి ఏ ఇబ్బంది ఉండదు.

**4) అందరు వెంట తెచ్చు కోవాల్సిన వస్తువులు,ఇతర జాగ్రత్త సూచనలు.**

 లగేజి జాగ్ర త్తలు.-వారం రోజుల యాత్రకు సరిపడ 5 జతల బట్టలు అదనంగా తెచ్చుకుంటే చాలు.అలాగే మీ లగేజిలో 2టవల్స్ ,బెడ్ షీట్(ట్రైన్ లో అవసరానికి)సోపు(2 చిన్న సోపులు,2టవల్స్ జంటగా వచ్చే లేడిస్, జెంట్స్ విడివిడిగా తెచ్చుకోండి.వాటి అవసరం బైధ్యానాద్ లో కేవలం స్నానం కోసం హోటల్ రూంలలో లేడీస్ జెంట్స్ విడివిడిగా  వెళ్ళినప్పడు అవసరం పడుతుంది),పేస్ట్, డైలి వేసుకునే మందులు, అలాగే ఇతర అత్యవసర టాబ్లెట్లు అంటే జ్వరానికి డోలో,మోషన్ కంట్రోల్, వాంప్టింగ్ కంట్రోల్ తదితర టాబ్లెట్స్ తెచ్చుకోండి.

        లగేజి లో ఒక గొడుగుకాని పల్చటి రేయిన్ కోటు కాని ఖచ్చితంగా తెచ్చుకోండి. గొడుగు సర్వవేళల మీతో పాటే ఉండాలి,అంతే తప్ప గొడుగు తెచ్చుకొని లగేజి బ్యాగులో పెట్టుకోరాదు. లగేజి బ్యాగు ఒక్కరు 10 కిలోలు దాటకుండా మనిషికి ఒక్క బ్యాగు మాత్రమే తెచ్చుకోవాలి. విడిచిన బట్టలు వేసుకోవడానికి పెద్ద ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి.అలాగే ఇంట్లో ఉన్న మరికొన్ని ప్లాస్టిక్ కవర్స్ కూడా పెట్టుకోండి, మొబైల్ తడువకుండా, ఎక్కడైనా ప్రసాదాలు తీసుకున్న రకరకాల సందర్భాల్లో పనికి వస్తుంటాయి కాబట్టి…

  విలువైన బంగారు అభరణాలు తెచ్చుకోవద్దు,ట్రైన్ లోకిటికీలు తీసి లేడిస్ అటువైపు తలపెట్టి పడుకోవద్దు.అలాగే మని హ్యాండు బ్యాగుల్లో పెట్టి తలపక్కకు హ్యండు బ్యాగులు పెట్టి లేడీస్ కు పడుకోవడం అలవాటు.రాత్రి పూట దిగే ఏ ప్రయాణికుడో మీరు నిద్రలో ఉన్నప్పుడు వాటిని పట్టుకుని దిగుతారు కాబట్టి ఆ పొరపాట్లు చేయకండి.యాత్రలో సర్వవేళల్లో మీ బంగారం,డబ్బులు జాగ్తత్ర జాగ్రత్త అని ముందే 100 సార్లు చెపుతున్నాను.పిక్ పాకెటర్స్, బంగారం గొలుసులు కొట్టేసేవారు గుళ్ళకు పోయివచ్చేప్పుడు, రోడ్ మీద నడిచేప్పడు, ట్రైన్ ప్రయాణంలో ప్రతిదగ్గర ఉంటూనే ఉంటారు కాబట్టి ఎవరి జాగ్రత్తల్లోవారు నిరంతరం ఉండాలి.ఒక్కసారి డబ్బులో ,నగలో పోయిన తరువాత ఏ కంప్లైంట్ ఇచ్చిన ఏ ప్రయోజనం ఉండదు.కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారు ముందే ఉండాలి.

వెహికిల్ లో ఉదయం ఎక్కేప్పుడు ఒకసారి లగేజి ప్యాక్ చేసి ఎక్కించాక తిరిగి రాత్రి రైల్వేష్టేషన్ లేదా హోటల్ రూంలో దిగినప్పుడే ఆ లగేజి దింపబడుతుంది.మీకు డైలి అవసరాలు ఉండే టాబ్లెట్లు,స్నాక్స్ , గుళ్ళో పెట్టే వత్తులు, చీరెలు తదితర పూజ సామాగ్రి ఏదైన ఉంటే అవన్ని మీతో పాటే విడిగా హ్యండుబ్యాగులో మీసీటు కింద పెట్టుకోవాలి. అంతే తప్ప ఒక్కసారి వెహికిల్  పైకి ఎక్కించిన తరువాత వాటిని మళ్ళి కిందకు దించడం ఎట్టిపరిస్థుతుల్లోను ఉండదు.

*5)*** ఫుడ్ *****

అప్ డౌన్ ట్రైన్,ఫ్లైట్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంటు ఉండదు. ట్రైన్ జర్నీలో లో మొదటి రోజు తినడానికి హోంఫుడ్ తెచ్చుకోండి. మర్నాడు భువనేశ్వర్ లో దిగిన తరువాత నుండి మళ్ళి రిటర్న్ లో భైద్యనాధ్ లో ట్రైన్ లేదా ఫ్లైట్ ఎక్కే ముందు లంచ్ వరకు యాత్ర మొత్తంలో మా తరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉంటుంది.అప్ డౌన్ ట్రైన్స్ లలో మీరు అరెంజ్ చేసుకోవాలి.యాత్రలో ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం మీల్స్ తో కూడిన లంచ్,డైలి మధ్యహ్నం లంచ్ తో పాటు 1లీటర్ మినరల్ వాటర్ బాటిల్,(ఒక్కసారి మద్యహ్నం మాత్రమే) సాయంత్రం టీ,మరియు రాత్రి అల్పాహారం ఉంటుంది(అల్పాహరం అంటే ఏదేని టిఫిన్ ..డిన్నర్ అని కాదని గమనించగలరు)   యాత్రలో ఇంటిదగ్గర తిన్నంత టైమ్ ప్రకారం తినడం వీలుపడదు ఒక్కోసారి కొంచెం ముందుగా, కొంచెం వెనుకగా తింటాం కాబట్టి షుగర్ టాబ్లెట్స్ లాంటివి వేసుకునేవారు ఖచ్చితంగా లైట్ స్నాక్స్,బిస్కెట్స్ తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి. అందరు మీకు ఇష్టమైన ఒక చిన్న పచ్చడి బాటిల్ పెట్టుకోండి.యాత్రలో మీకు సౌకర్యంగా ఉంటుంది.

*6)****మొబైల్ ఆప్ లు, డాటా రోమింగ్ సెట్టింగ్స్…*****

మీ మోబైల్ లో సెట్టింగ్స్ మీరు గాని పిల్లల ద్వారా గాని కొన్ని చేయించకోండి.అవి చాలామందికి మొబైల్ లో Data Roaming ఆన్ లో ఉండదు.బయటి రాష్ట్రాలకు వెళ్ళనప్పుడు డాటా రోమింగ్ ఆన్ లో ఉంటేనే మీ మొబైల్ లో ఇంటర్ నెట్, వాట్సప్, యుట్యూబ్ లు పనిచేస్తుంటాయి.చాలామంది మొబైల్ లో ఇది ఆన్ చేసి ఉండదు.కాబట్టి ఈరోజే మీరు గాని మీ పిల్లలతోకాని మొబైల్ లో సెట్టింగ్స్ లో కి వెళ్ళి Data Roaming ఆన్ చేయించుకోండ. అలాగే గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి Where is My Train  అనే ఆప్ ను ఇన్ స్టాల్ చేయించుకోండి. దాంట్లే దేశంలోని ఏ ట్రైన్ అప్ డేట్ టైమింగ్ వివరాలను ఆ ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి స్పాట్ లో లైవ్ లో చెక్ చేసుకోవచ్చును.మన ప్రయాణంలో మొత్తం 6ట్రైన్స్  ఉంటాయి కాబట్టి ఈ ఆప్ మీకు ఎంతగానే ఉపయోగ పడుతుంది.మనం ఎక్కాల్సిన ట్రైన్ మనం ఎక్కాల్సిన స్టేషన్ కు ఎంత సేపట్లో వస్తుంది ఇంకా ఏ ఫ్లాట్ ఫాం మీదకు వస్తుంది అలాగే మనం దిగాల్సిన స్టేషన్ ఎంత దూరంలో ఎంత సేపట్లో వస్తుంది అనేది ఎవరిని అడుగనవసరం లేకుండానే మీ అంతటే మీరే స్వయంగా ఈ ఆప్ లో చూసుకోవచ్చును. ట్రైన్ టైమింగ్స్ దీంట్లో కరెక్టుగా చూపించిన ఏ ఫ్లాట్ ఫాం మీదకు మనం ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది అనేది దీంట్లో  నమ్మడానికి వీలు పడదు , ఒక్కోసారి సికింద్రాబాద్ లాంటి పెద్ద స్టేషన్ లలో స్పాట్ లో రైల్వేవారు ఫ్లాట్ ఫాంలను మారుస్తుంటారు.

   *7)**ఫైనల్ సూచనలు.***

యాత్ర అంటే జీవితకాలం మధురైమన తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన విషయం.మనం వెళ్ళేది తీర్థయాత్ర కు తప్ప పంక్షన్ కు కాదు.చిన్న విషయాల దగ్గర పట్టించుకుని గొడవపెట్టడం చేయరాదు. తీర్థ యాత్ర అన్నాక యాత్రలో కామన్ గా కొన్ని ఇబ్బందులు సమయం సరిపోకపోవడం,టైం ప్రకారం యాత్ర పూర్తి చేయడం లాంటివి ఉంటాయి. వాటన్నింటిని ఒపికతో సర్దుకుపోవాలి.విడిగా ఏమైన ఇబ్బందులు ఉంటే నాతో విడిగా చెప్పాలి. యాత్రలో బస్ లో ట్రైన్ లో తిరిగేప్పుడు ప్రయాణంలో మనం చూసేది కేవలం టెంపుల్సే కాదు,అక్కడ ఉన్న పక్రుతి,నదులు,పల్లెలు ,పట్టణాలు,కొండలు,కోనలు, మార్గ మద్యంలో వచ్చే పంటలు,అడవులు,ప్రజలు, వారి డ్రెస్సింగ్,వారి ఆచార వ్యవహారాలు,వారి ఫుడ్ హాబిట్స్ ఇలా ప్రతిదాన్ని చూసి ఎంజాయ్ చేయాలే తప్ప మనం తరువాత వెళ్ళాల్సిన టెంపుల్ లేదా ఊరు ఇంకా ఎంత సేపట్లో వస్తుంది ఎప్పుడు చేరుకుంటాము అని ఎదురు చూడరాదు అలాగే మాటి మాటికి అడుగరాదు, దిగాల్సిన ఊరు టెంపుల్ వచ్చాక నేను ఎలాగు చెపుతాను కదా.యాత్రలో ప్రతిరోజు ఈ రోజు ఏమేం చూస్తాం , ఒకటి చూసిన తరువాత ఇప్పుడు తరువాత ఎక్కడికి వెళుతున్నాం అని ప్రతిసారి చెపుతాను..దిగాల్సింది ఎంతదూరం అని కుతుహలం ఉన్న గూగుల్ మ్యాప్ లో చూసుకోగలరు, కిలోమీటర్ల దూరం,టైంతో సహా కనపడుతుంది.

     యాత్ర అంటేనే టైం మేనేజ్ మెంట్. గుళ్ళోకి వెళ్ళినప్పుడే అక్కడ మేము రెగ్యులర్ గా దర్శనానికి పట్టే టైం సుమారుగా లెక్కవేసుకునే రిటర్న్ వచ్చే టైం , రిటర్న్ లో వెహికిల్ ఎక్కాల్సిన ప్లేస్ చెపుతుంటాం.అవన్ని యాత్రికులు ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించి టైం ప్రకారం వెహికిల్ దగ్గరకు చేరుకోవాలి. ప్రతి యాత్రలో కేవలం ఒకరిద్దరి నిర్లక్షపూరిత లేట్ గా వెళ్ళే అలవాట్లు , మనం కాసేపు లేటుగా వెళితే ఏమవుతుందులే మనం కోసం వెహికిల్ ఆగదా అనే మనస్థత్వం కారణంగా యాత్ర ప్రొగ్రం మొత్తం తలకిందులు అవుతుంది.అలా లేట్ గా వచ్చేవారికోసం వెహికిల్,ట్రైన్ ఆగదు,ముందుకు వెళుతుంది,లేట్ కామర్స్ విడిగా వెహికిల్ లో రావాలి. ఏదేని గుళ్ళో మేయిన్ గుడి దర్శనం చేసుకుని రావాలి తప్ప మన హిందుటెంపుల్స్ లలో ప్రధాన గుడి కాకుండా ఆదే గుడి ప్రాంగాణంలోనే మరెన్నో ఉప దేవాలయాలు ఉంటాయి.వాటని అన్నింటిని దర్శనం చేసుకుని రావలంటే అక్కడే గంటలు పడుతుంది.అలాంటప్పుడు ఒకే రాష్ట్రం యాత్ర వారం పెట్టుకుంటే రోజుకో టెంపుల్ చొప్పున అది పాజిబుల్ అవుతుంది కాని మనలాంటి యాత్రలో 4 రాష్ట్రాలు 1దేశం తిరిగే యాత్రలో సెట్ కాదు.అలా తిరగాలంటే ఇదే యాత్ర కనీసం నెలరోజలు యాత్ర ఖర్చు 1 లక్షరుపాయలు అవుతుందని గమనించగలరు. కాబట్టి మన యాత్ర ప్రోగ్రాంలో ఉన్న టెంపుల్స్ విజిట్ మాత్రమే చూస్తాము తప్ప ఇతరాత్ర వీలుపడదు.

       ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా,  ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా  రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ   హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…

ధన్యవాధములతో.. ఇట్లు..రవీందర్,శ్రీటూర్స్. 8985246542