5-06-2023 మధ్యప్రదేశ్ ,గుజరాత్ యాత్ర కు వస్తున్న యాత్రికులందరికి శ్రీటూర్స్ రవీందర్ హ్రుదయపూర్వక స్వాగతం.(ఫోన్.8985246542)

ఈ యాత్రకు వస్తున్న వారు కొందరు మీరు పంపిన లింక్ ఓపెన్ కావడం లేదని చెప్పారు కాబట్టి తిరిగి ఈ మ్యాటర్ మొత్తం పంపిస్తున్నాను. మొబైల్ లో ఇంటర్ నెట్ ఆన్ చేసి లింక్ నొక్కితే గూగుల్ క్రోమ్ లో వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది,ఓపెన్ కాకపోవడం అనే ప్రశ్నేలేదు.మీ మోబైల్ లో ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్,ఫైర్ ఫాక్స్,గూగుల్ క్రోమ్ ఏ బ్రౌజర్ ఉన్న ఏ వైబ్ సైట్ అయినా ఓపెన్ అవుతుంది.ఓపెన్ కావడం లేదంటే మీ మోబైల్ ఫోన్ లో ఏ బ్రౌజర్ ఉందో చెక్ చేసుకోగలరు…

05-06-23 గుజరాత్,మధ్యప్రధేశ్   యాత్రకు సంబందించి ముఖ్య సూచనలు-జాగ్రత్తలు కింద జాగ్రత్తగా చదువగలరు.

కింది వివరాల్లో ఎక్కడైనా 2703-23 అని పొరపాటున  ఉంటే అది 05-06-23 యాత్రగానే చదువుకోగలరు.ఎందుకంటే పాత ఫైల్ నే డేట్ మాడిఫై చేసి  అవే కామన్ యాత్ర సూచనలు  పంపిస్తాము కాబట్టి….***ముఖ్య జాగ్రత్త** కింది సూచనల్లో ప్రతి పాయింట్ జాగ్రత్తగా చదివి ఆ ప్రకారంగా ఫాలో కావాలి.యూత్ర సూచనలు అంటే ఎవరికో టైంపాస్ కోసం పంపేవి కావు, మీ కోసమే టైం పెట్టి టైప్ చేసి పంపేవి ,కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరు చదవండి మీతో పాటు వచ్చే మీ సహ యాత్రికుల కు కూడా వాట్సప్ లో పంపగలరు.

ఈయాత్రకు నేను సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో ఎక్కడం లేదు 5-6-23న రాత్రి పూర్ణ రైల్వేష్టేషన్ లో అర్థరాత్రి ఎక్కుతాను.కారణం ఏమంటే మహారాష్ట్ర యాత్ర 2-6-23న వెళ్ళి 5-6-23న సాయంత్రం మహారాష్ట్ర యాత్రకు వచ్చిన యాత్రికులన ఔరంగాబాద్ లో ట్రైన్ లో ఎక్కించి నేను పూర్ణ ష్టేషన్ లో ఎక్కుతాను.మర్నాడు అందరితో పాటే ఖాండ్వా రైల్వేస్టేషన్ లో 9.30 కు మీతో పాటే దిగుతాను.కాబట్టి సికింద్రాబాద్ స్టేషన్ లో అంతా జాగ్రత్తగా ట్రైన్ లో ఎక్కేంత వరకు మీ స్వంత బాధ్యత మీదనే ట్రైన్ ఎక్కగలరు. మీరు ఎక్కే ట్రైన్ నెంబర్ 12720 ,  ట్రైన్ నేమ్.  HYB JP Exp  , ఈ ట్రైన్ నాంపల్లి నుండి వస్తుంది సాదారణంగా 7వ నెంబర్ ఫ్లాట్ ఫాం మీదకు వస్తుంది. కాని ఒక్కోసారి ఫ్లైట్ ఫాం మారుతుంది.  రైల్వేస్టేషన్ లో డిస్ ప్లే బోర్డులో చూసి లేదా ఎంక్వైరిలో అడిగా మాత్రమే ఏ ఫ్లాట్ మీదకు ట్రైన్ వస్తుందో తెలసుకుని మాత్రమే ఆ ఫ్లాట్ ఫాం మీదకు వెళ్ళగలరు……..

***ఈ యాత్రకు ఇప్పటికి 50  మంది యాత్రికులం బుక్ అయ్యారు.05 06-23 సోమవారం రాత్రి 8.30 కు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి మన ట్రైన్ బయలుదేరుతుంది. (ట్రైన్ నేమ్, నెం. 12720  HYB JP Exp , .మీరంతా రాత్రి 8.00 కే  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి.అక్కడికి చేరుకున్నాక డిస్ ప్లే బోర్డులో ట్రైన్ నెంబర్ చూస్తే అది  ఏ ఫ్లాట్ ఫాం మీదకు వస్తుంది  అనేది క్లియర్ గా   తెలుస్తుంది. ట్రైన్ లో మీ మొబైల్ లో ఉన్న టికెట్ చూయించండి.   యాత్రికులంతా ఇంటిదగ్గర బయలుదేరేప్పుడు ఇంటిదగ్గర తినిరావాలి లేదా రాత్రి తినడానికి హోంపుడ్ తెచ్చుకోవలెను .+ మార్నింగ్ 9.30 కు ట్రైన్ దిగేలోపు తినడానికి కూడా ఏదైనా హోం ఫుడ్ తెచ్చుకోగలరు.   అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు ముందే అందరికి క్లియర్ గా చెప్పాం కాబట్టి మర్నాడు ఉదయం 9.30 కు ఖాండ్వా రైల్వేస్టేషన్ లో  దిగేవరకు హోంఫుడ్ పులిహోర,పూరి లాంటివి తెచ్చుకోగలరు.. దూరంనుండి వచ్చేవారు సికింద్రాబాద్  రైల్వేస్టేషన్ కు ఎంటైమ్ కి చేరుకుంటామో సుమారు అంచానా వేసుకుని ఆప్రకారం ట్రైన్ టైం కంటే ఖచ్చితంగా అరగంట,గంట  ముందే ఉండగలరు. మద్యలో ట్రాఫిక్ జామ్ అయ్యిందండి టైమ్ కి చేరుకోలేకపోయాం అంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ బయలుదేరేదే సికింద్రాబాద్ నుండి కాబట్టి కరెక్టుగా టైంకే బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం 9.30 గంటలకు ఖాండ్వా రైల్వే స్టేషన్ దిగుతాము. చేరుకుంటాము.. బస్ లో  ఎక్కాక మీ బ్యాలెన్స్ అమౌంట్ పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ ను క్యాష్ గానే పేచేయాలి.( నో గూగుల్ పే,ఫోన్ ఫే.. ఆన్ లైన్ క్యాష్ పేమెంట్ ఓన్లి) రూ.2000 నోట్లు కాకుండా రూ.500 నోట్లు మాత్రమే పేచయగలరు.

  • టూర్ లో తిరిగేప్పడు టైం విషయంలో అందరు స్ట్రిక్ట్ గా టైం మేయింటేన్ చేయాలి. అప్పుడే మన యాత్ర ఏవి మిస్ కాకుండా అన్ని చూడగలం.టూర్ మేనేజర్ ముందు చెప్పిన టైం కల్లా అంతా ఆయా క్షేత్రాల దర్శనం,పొద్దున హోటల్ రూంనుండి బయలుదేరడం చేయాలి.కొందరి ఆలస్యం చేయబట్టి కొన్ని చూసే పుణ్యక్షేత్రాలు మిస్ అయితే ఆలస్యం చేసినవారే బాధ్యత వహించాలి.టూర్ ఆపరేటర్ చెప్పిన టైం చెప్పినట్లుగా ఫాలో అయితే ఏటెంపుల్ కూడా మిస్ కాదు.
  • ముఖ్య విషయం… ఒక్కసారి ఉదయం వెహికిల్ పైకి పంపి ప్యాక్ చేయించిన లగేజి తిరిగి నైట్ వరకు ఎక్కడ దింపబడదు.మీకు డైలి నీడ్ ఉండే ఆధార్ కార్డ్,టాబ్లెట్లు,మెడిసిన్స్,ఫుడ్ ఐటంస్ తప్పకుండా మీతోపాటే హ్యాండ్ బ్యాగులో ఉంచుకోవాలి.
  • మధ్య ప్రధేశ్ లో ఖాండ్వాలో మర్నాడు ఉదయం 9.30   ట్రైన్ దిగితాము.ట్రైన్ దిగడానికి ముందే అంతా ఉదయమే కాలక్రుత్యాలు తీర్చుకుని టిఫిన్ చేసి,టీ తాగి, ఉండాలి, టిఫిన్ కు అని మద్యలో  ఎక్కడ ఆగం.2గంటలు ప్రయాణం చేసి నర్మద నది,ఓంకారేశ్వర్ చేరుకుంటాం. అంతా అత్యంత పవిత్రమైన  నర్మద నధిలో స్నానం చేస్తాము.నది పక్కనే ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటాము..  ట్రైన్ దిగేముందే ఒక ప్లాస్టిక్ కవర్ లో జత బట్టలు,టవల్ పెట్టుకోండి.నది పక్కన క్యాబిన్ లో డ్రెస్ మార్చుకుని దర్శనం కు వెళుతాము. ఓంకారేశ్వర్ దర్శనం తరువాత 4గంటలు ప్రయాణం 150 కీ.మీ దూరంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం,ఉజ్జయిని శక్తి పీఠం ,కాలబైరవ్ టెంపుల్ దర్శనాలకు వెళుతాం.రాత్రి ఉజ్జయిని జ్యోతిర్లింగం క్లోజింగ్ హరతి దర్శించుకుంటాం.  అదేరాత్రి 12గంటలకు ఉజ్జయిని నుండి గుజరాత్ అహ్మదాబాదుకు అదే రాత్రి ట్రైన్ జర్నీలో వెళుతాం.
  • ఉదయం కూడా అహ్మదాబాదు రైల్వేస్టేషన్ లో ఉదయం 8.30 కు ట్రైన్ దిగుతాము. ట్రైన్ దిగడానికి ముందే ట్రైన్ లో తప్పనిసరిగా కాలక్రుత్యాలు తీర్చుకోవాలి(బ్రషింగ్, నాచురల్ కాల్స్ లాంటివి) అహ్మదాబాదులో గాందిజి సబర్మతి ఆశ్రమం చూసి అక్కడే గుజరాత్ ఫేమస్ డోక్లా టిఫిన్ చేసి ద్వారక బయలుదేరుతాం.  .నైట్ ద్వారకలోహోటల్ రూం  స్టే ఉంటుంది మద్యలో ప్రెషప్ , స్నానం లాంటివి ఉండవు..ఆ రోజు ఏ టెంపుల్ చూసేది లేదు కాబట్టి.ద్వారకు హోటల్ రూం వెళ్లాకనే అన్ని.
  • వెహికిల్ వెళ్ళని చోట షేరింగ్ ఆటోచార్జీలు, ఎంట్రెన్స్ టికెట్స్, (పటేల్ స్టాచ్యు లాంటి చోట్ల) దేవాలయాల్లో పూజలు అభిషేకాలు చార్జీలు,నదులు,సముద్రాల్లో బోటింగ్ చార్జీలు డ్రైవర్,క్లీనర్ కు రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కరు రూ.100 చొప్పున వారికి టిప్ ఇవ్వవలెను. హోటల్ రూంలో మీ బ్యాగులు  రూంబాయ్ ద్వారా మోయించుకుంటే వారికి టిప్ లు ఇవ్వడం  కనీస దర్మం . అలాగే యాత్రలో ఎవరికేమైనా ఇబ్బంది ఎదురైతే టూర్ మేనేజర్ కు విడిగా వ్యక్తిగతంగా చెప్పాలి తప్పా యాత్రలో అందరి మూడ్ చెడిపోయేట్లు పెద్దగా అరవడం,గొడవ పెట్టడం చేయరాదు. ఇతరుల మూడ్ చెడగొట్టరాదు. మనం వెళ్ళేది పుణ్యక్షేత్రాల దైవ యాత్రకు కాని ఫంక్షన్ హాల్ కు కాదు దయచేసి అందరు గుర్తుంచుకోవాలి…యాత్ర అన్నాక ఎవో చిన్న చిన్న ఇబ్బందులు కామన్ గా ఉంటాయి.దైవ యాత్రలో శరీరం ఎంత అలసిపోతే అంత ఖర్మ పద్దు క్షయం అవుతుంది అనేది ఒక దైవ రహాస్యం…. ఒక యాత్రకు వెళ్ళివచ్చాక అది జీవిత కాల మధుర మైన గుర్తుగా మిగిలిపోవాలి.
  • అందరు ఖచ్చితంగా 10 కిలోల బరువు దాటని ఒక్క బ్యాగ్ జిప్ ఉన్నది మాత్రమే తెచ్చుకోవాలి.కొందరు విడిచిన బట్టలు వేయడానికి మరో బ్యాగ్ తెచ్చుకుంటారు.అలా కాకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుంటే సరిపోతుంది.విడిచిన బట్టలు ఆ ప్లాస్టిక్ కవర్ లో వేసి ,అదే బ్యాగులో పెట్టుకోవాలి. చేతి కర్ర సంచులు ఎట్టి పరిస్తితుల్లోను అనుమతించబడవు. ఖచ్చితంగా జిప్ ఉన్న బ్యాగు- ఫ్యామిలికి ఒక బ్యాగు మాత్రమే తెచ్చుకోవాలి.మనం 3 ట్రైన్స్ మారాలి. ఫ్లాట్ ఫాంలు ఎక్కేప్పుడు దిగేప్పుడు ఎవరి లగేజి వారే మోసుకోవాలి కాబట్టి మీరు బుజాన మోయగలిగినంత లగేజి మాత్రమే  ఇబ్బంది పడకుండా తక్కువగా తెచ్చుకోండి.రిటర్న్ వచ్చేప్పుడు ఎలాగో షాపింగ్ చేయడం ద్వారా లగేజి బరువు పెరుగుతుంది కాబట్టి వీలైనంతగా తక్కువ లగేజి 10 కిలోలు దాటకుండా తెచ్చుకోండి.
  • 5 జతల బట్టలు, 1 బెడ్ షీటు, 1 టవల్ ,సోపు తెచ్చుకోండి. మగవాళ్ళు ఒక పంచె , (తెల్లటి) తెచ్చుకోండి. నాగేశ్వర జ్యోతిర్లింగంలో గర్భగుడిలో కూర్చుని అభిషేకం పూజలో పాల్గొనవచ్చును.(చార్జీలు ఉంటాయి అదనం)అలాగే అభిషేకం చేసుకోవడానికి ఒక చిన్న స్టీల్ లేదా రాగి  చెంబు వెంట తెచ్చుకోండి. స్ర్తీలు దీపారాదన చేయడానికి దీపం ప్రమిదలు, వత్తులు,ఆయిల్ తెచ్చుకుంటే అక్కడ వీలైన దేవాలయాల్లో ముట్టించుకోవచ్చును.
  •  కోవిడ్- జాగ్రత్తలు, మాస్క్ దరించడం, శానిటైజర్ తెచ్చుకోవడం అందరు పాటించాలి. వాక్సినేషన్ వేసుకున్న సర్టిఫికెట్లను అందరు డౌన్ లోడు చేసుకుని ప్రింట్ కాపీలను దగ్గర పెట్టుకోవాలి.
  • వేక్సిన్ సర్టిఫికెట్ మీదగ్గర లేకుంటే దాన్ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చునో ఈ లింక్ నొక్కి తెలుసుకోండి,ప్రింట్ తీసుకోండి.
  • https://selfregistration.cowin.gov.in/    ఈ లింక్ ఓపెన్ చేసిన తరువాత, మీరు వాక్సిన్ వేసుకున్నప్పటి మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేయండి. ఓ.టి.పి.వస్తుంది.ఎంటర్ చేయండి. అక్కడ మీ వాక్సిన్ సర్టిఫికెట్ కనపడుతుంది,పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోండి. (గమనిక * ఎక్కడ సర్టిఫికెట్ చూడడం లేదు కాబట్టి , ఇది తెచ్చుకోకున్నా పర్వాలేదు,)
  • అలాగే మీ వెంట రెగ్యులర్ గా వాడుతున్న టాబ్లెట్స్,మెడిసిన్స్ ఎమున్నా తెచ్చుకోండి, విలువైన బంగారు అభరాణాలు ఎట్టిపరిస్తితుల్లో తెచ్చుకోవద్దు.మీ లగేజికి ట్రైన్ లో లాక్ చేయడానికి గొళుసులు,తాళం తెచ్చుకోండి.
  • మీ ఒరిజినల్ ఆధార్ కార్డును ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలి. అలాగే ఆధార్ కార్డు 3 జీరాక్స్ కాపీలను కూడ ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలి.
  • యాత్రలో ప్రతిరోజు టీ,టిఫిన్(మార్నింగ్ 1 టిఫిన్ లిమిటెడ్)మధ్యహ్నం మీల్స్ భోజనం,సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం బయటి హోటల్స్ లలో ఉంటుంది.చాలవరకు ప్రదేశాల్లో మేము రెగ్యులర్ గా వెళ్ళే హోటల్స్ లలో ముందుగానే ఫోన్ చేసి వెళుతాము.కొన్ని ప్లేసుల్లో స్పాట్ గా ఎక్కడ ఉంటే అక్కడ తింటాము. ఫుడ్ విషయంలో ఒక ముఖ్య విషయం ఏమంటే రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లెక్కన ఉండు అని. వెళ్ళే వారం రోజులు బయటి రాష్ట్రాల దేవాలయ దర్శనాలే కాకుండా అక్కడి సంస్క్రుతి,సంప్రాదాయం ,వంట అలవాట్లు అన్ని గమనించాలి.ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఎవరికైనా కూడా తమ జన్మ స్థలంలో చిన్నప్పటినుండి తినే ఫుడే మహా టేస్ట్ గా తోస్తుంది.వాస్తవం ఏమంటే అదొక అలవాటు మాత్రమే.మనం వెళ్ళేదగ్గర మద్నహ్న భోజనాలు దాదాపుగా మనం తినే మీల్స్ మాదిరిగానే అంతటా గుజరాత్,మద్యప్రదేశ్ లో దొరకుతుంది. కాని ఉదయం టిఫిన్ ఇడ్లి ,వడల బదులు వారి లోకల్ టిఫిన్స్(పోహా,డోక్లా,పరాట..) లబిస్తాయి.వారి టిఫిన్స్ ఓ నాలుగు రోజులు మనం కూడా తిని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మన యాత్ర అంతా చాలా ఆనందకరంగా సాగుతుంది.ఫుడ్ బాగాలేదు అనే ఫీలింగ్తో ఉండేవారికి, మేం అరెంజ్ చేసే ఫుడ్ నచ్చని వారికి డైలి రూ.300చొప్పున యాత్రలో ఉన్నన్ని రోజులు (టీ , టిఫిన్, భోజనం, రాత్రి అల్పాహారం కోసం) రిఫండ్ పేచేస్తాం,దాంతో హోటల్లో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును.మినరల్ వాటర్ బాటిల్ 1లీటర్  డైలి మద్యహ్నం భోజనంతో పాటు అందచేయబడుతుంది.
  •  అలాగే   వెహికిల్ లో కూర్చుని జర్నీ చేసేప్పుడు కూడా మనం తదుపరి వెళ్ళే ప్రదేశం ఇంకా ఎప్పుడు వస్తుంది , ఎన్ని గంటలకు వస్తుంది అని ఎదురు చూడడం కాకుండా మనం యాత్రలో తిరిగే ప్రతి  క్షణం , మన వెళుతుంటే పక్కన కనపడే పక్రుతి, కొండలు,వాగులు,నదులు అన్నింటిని చూస్తు ఎంజాయ్ చేయాలి.ఒక్కసారి వెళ్ళి చూసిన ప్రదేశం మళ్ళి జన్మలో వెళుతామో వెళ్ళమో తెలియదు. కాబట్టి పుణ్యక్షేత్రాల దర్శనమే కాదు వెహికిల్ లో జర్నీ చేస్తున్న ప్రదేశాలన్నింటి చూస్తు ఎంజా య్ చేసే మూడ్ తో ఉండాలి.
  • బస్ లో  1-4 వరుసలు రూ.600 పేమెంట్ చేసిన వారికి ఫిక్స్ డ్ సీట్లు ఉంటాయి. మిగితా అందరు  అందరు డైలి 1 వరుసల చొప్పున వెనక్కి   జరగాలి.అందరికి వెహికిల్ లో రొటోషన్ పద్దతిలో సీట్లు మారుతాయి. .ఆ సీట్లు కావల్సిన వారు  రూ.600 పేమెంట్  చేసి రిజర్వు చేసుకోగలరు. 
  • 6)యాత్ర దర్శన సమయాల్లో వాతావరణం, పక్రుతి,ట్రాఫిక్ జాంలు,బంద్ లు ఇతర అనివార్య కారణాలతో కొన్ని ప్రదేశాలకు దర్శించకపోవడం జరిగవచ్చును. అప్పుడు సంధర్బానుసారంగా అందరి సౌకర్యం కోసం టూర్ ఆపరేటర్ తీసుకునే  నిర్ణయమే అంతిమం.ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.ఎట్టి పరిస్థితుల్లోను  రిటర్న్ ట్రైన్ టైంకు 1 గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని గమనించండి. టూర్ ఆపరేటర్ ప్రాధమిక విధి మీకు యాత్ర సమయంలో అన్ని రకాలుగా ఫ్లైట్,బస్,ట్రైన్,హోట్ ల్ రూంలు,టీ,టిఫిన్,భోజన సదుపాయలు ఏర్పరచడం,అన్ని పుణ్యక్షేత్రాలదర్శనానికి మిమ్మల్ని సౌకర్యవంతంగా తీసుకెళ్ళడం  అని దయచేసి మర్చిపోవద్దు.
  • ఏ రోజున ఏమేం చూస్తాం అని ఒక రోజు ముందు చెప్పుకుంటాం,అదేరోజు ఉదయం కూడా ఆరోజు ఏంచూస్తామో వెహికిల్ లోనే అందరికి గ్రూపుగా ఒకేసారి చెప్పబడుతుంది.అంతే తప్ప దాన్నే పదిసార్లు అడిగిందే అడుగరాదు..

పూర్తి పరమేశ్వరుని దీవెనలు ఆశిస్సులు అందాలని మన యాత్ర అందరికి ఆనందంగా పూర్తికావాలని ఆ పరమేశ్వరుడుని వేడుకుంటూ…

ఓం నమశ్శివాయ.. రవీందర్.శ్రీటూర్స్. 8985246542

మా ఇతర యాత్రల వివరాల కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. https://shreetours.in/