22-01-2022 మధ్యప్రదేశ్ ,గుజరాత్ యాత్ర కు వస్తున్న యాత్రికులందరికి శ్రీటూర్స్ రవీందర్ హ్రుదయపూర్వక స్వాగతం.(ఫోన్.8985246542)

 మీ  మొబైల్ లో ఇంటర్ నెట్ ఆన్ చేసి లింక్ నొక్కితే గూగుల్ క్రోమ్ లో వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ కావడం లేదంటే మీ మోబైల్ ఫోన్ లో ఏ బ్రౌజర్ ఉందో చెక్ చేసుకోగలరు…

యాత్రకు సంబందించి ముఖ్య సూచనలు-జాగ్రత్తలు కింద జాగ్రత్తగా చదువగలరు.

కింది వివరాల్లో ఎక్కడైనా 17-10-22 అని ఉంటే అది 22-01-23 యాత్రగానే చదువుకోగలరు.ఎందుకంటే పాత ఫైల్స్ నే డేట్ మాడిఫై చేసి పంపిస్తాము..

  • ఈ యాత్రకు మొత్తం 17 మంది యాత్రికులం వెళుతున్నాం(టూర్ ఆపరేటర్ తో సహా).17 సీటర్ ఎ.సి టెంపో ట్రావెలర్ ఉంటంది(40 మెంబర్స్ అయితే 40 సీటర్ బస్ ఉంటుంది) 2201-23 సోమవారం రాత్రి 9.30 కు లింగంపల్లి  రైల్వేస్టేషన్ నుండి మన ట్రైన్ బయలుదేరుతుంది. (ట్రైన్ నేమ్, నెం. LP INDD HUMSAFAR , Train Number -20915 ) ఏ ఫ్లాట్ ఫాం అని ముందే అడుగవద్దు.మీరంతా రాత్రి 8.30 కే లింగంపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి.అక్కడికి చేరుకున్నా ఏ ఫ్లాట్ ఫా అనేది తెలుస్తుంది. రైల్వేస్టేషన్ వచ్చాక నాకు ఫోన్ చేసి (8985246542) హజరు వేయించుకున్న తరువాత మీకు ప్రింటెడ్ ట్రైన్ టికెట్ ఇస్తాను. యాత్రికులంతా ఇంటిదగ్గర బయలుదేరేప్పుడు ఇంటిదగ్గర తినిరావాలి లేదా రాత్రి తినడానికి హోంపుడ్ తెచ్చుకోవలెను.అలాగే అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు కాబట్టి మర్నాడు నైట్ దిగేవరకు హోంఫుడ్ పులిహోర,పూరి లాంటివి తెచ్చుకోగలరు.. దూరంనుండి వచ్చేవారు లింగంపల్లి  రైల్వేస్టేషన్ కు ఎంటైమ్ కి చేరుకుంటామో సుమారు అంచానా వేసుకుని ఆప్రకారం ట్రైన్ టైం కంటే ఖచ్చితంగా 1గంట ముందే ఉండగలరు.మద్యలో ట్రాఫిక్ జామ్ అయ్యిందండి టైమ్ కి చేరుకోలేకపోయాం అంటే ట్రైన్ బయలుదేరేదే లింగపల్లి  నుండి కాబట్టి కరెక్టుగా టైంకే బయలుదేరుతుంది.ఈ ట్రైన్ సికింద్రాబాదు రాదు.లింగపల్లి నుండి బయలుదేరి వికారాబాద్ , షోలాపూర్, సూరత్ , బరో డా నుండి ఉజ్జియిని చేరకుంటుంది.24గంటలు ప్రయాణం.మర్నాడు రాత్రి 10గంటలకు చేరుకుంటాము…ట్రైన్ ఎక్కాక మర్నాడు మీ బ్యాలెన్స్ అమౌంట్ పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ ను క్యాష్ గానే పేచేయాలి.( నో గూగుల్ పే,ఫోన్ ఫే.. ఆన్ లైన్ క్యాష్ పేమెంట్ ఓన్లి)
  • టూర్ లో తిరిగేప్పడు టైం విషయంలో అందరు స్ట్రిక్ట్ గా టైం మేయింటేన్ చేయాలి. అప్పుడే మన యాత్ర ఏవి మిస్ కాకుండా అన్ని చూడగలం.టూర్ మేనేజర్ ముందు చెప్పిన టైం కల్లా అంతా ఆయా క్షేత్రాల దర్శనం,పొద్దున హోటల్ రూంనుండి బయలుదేరడం చేయాలి.కొందరి ఆలస్యం చేయబట్టి కొన్ని చూసే పుణ్యక్షేత్రాలు మిస్ అయితే ఆలస్యం చేసినవారే బాధ్యత వహించాలి.టూర్ ఆపరేటర్ చెప్పిన టైం చెప్పినట్లుగా ఫాలో అయితే ఏటెంపుల్ కూడా మిస్ కాదు.
  • ముఖ్య విషయం… ఒక్కసారి ఉదయం వెహికిల్ పైకి పంపి ప్యాక్ చేయించిన లగేజి తిరిగి నైట్ వరకు ఎక్కడ దింపబడదు.మీకు డైలి నీడ్ ఉండే ఆధార్ కార్డ్,టాబ్లెట్లు,మెడిసిన్స్,ఫుడ్ ఐటంస్ తప్పకుండా మీతోపాటే హ్యాండ్ బ్యాగులో ఉంచుకోవాలి.
  • మధ్య ప్రధేశ్ లో ఉజ్జియినిలో మర్నాడు రాత్రి 10గంటలకు  ట్రైన్ దిగితాము.నైట్ హోటల్ రూం స్టే చేసి మర్నాడు ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం,ఉజ్జయిని శక్తి పీఠం ,కాలబైరవ్ టెంపుల్ దర్శనాలకు వెళుతాం.అక్కడినుండి ఓంకారేశ్వర్  150 కి.మీ.వెళ్ళి. అదే రోజు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోంటాం. అక్కడ నర్మద నదిలో  స్నానం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఒక ప్లాస్టిక్ కవర్ లో విడిగా జత బట్టలు పెట్టుకోగలరు.స్నానం చేసాక అక్కడే బట్టలు మార్చుకున్నాక ఆ కవర్ వెహికిల్ లో పెట్టి  నదిపక్కనే ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటాము. తిరిగి అదేరాత్రి రిటర్న్ ఉజ్జయినికి వచ్చి. నైట్ ఉజ్జయిని టెంపుల్ లో క్లోజింగ్ హరతికి హజరు అయ్యి తరువాత ఉజ్జయిని నుండి గుజరాత్ అహ్మదాబాదుకు అదే రాత్రి ట్రైన్ జర్నీలో వెళుతాం.
  • మర్నాడు ఉదయం కూడా అహ్మదాబాదు రైల్వేస్టేషన్ లో ఉదయం 8.30 కు ట్రైన్ దిగుతాము. ట్రైన్ దిగడానికి ముందే ట్రైన్ లో తప్పనిసరిగా కాలక్రుత్యాలు తీర్చుకోవాలి(బ్రషింగ్, నాచురల్ కాల్స్ లాంటివి) అహ్మదాబాదులో గాందిజి సబర్మతి ఆశ్రమం చూసి అక్కడే గుజరాత్ ఫేమస్ డోక్లా టిఫిన్ చేసి ద్వారక బయలుదేరుతాం.ద్వారాక వేళ్ళేదారిలో మద్యహ్నం స్నానం,లంచ్ ఒకేదగ్గర  చేస్తాము.నైట్ ద్వారకలోహోటల్ రూం  స్టే ఉంటుంది.
  • వెహికిల్ వెళ్ళని చోట షేరింగ్ ఆటోచార్జీలు, ఎంట్రెన్స్ టికెట్స్, (పటేల్ స్టాచ్యు లాంటి చోట్ల) దేవాలయాల్లో పూజలు అభిషేకాలు చార్జీలు,నదులు,సముద్రాల్లో బోటింగ్ చార్జీలు డ్రైవర్,క్లీనర్ కు ఒక్కో రాష్ట్రంలో రూ.50 చొప్పున రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కరు రూ.100 చొప్పున వారికి టిప్ ఇవ్వవలెను. హోటల్ రూంలో మీ బ్యాగులు  రూంబాయ్ ద్వారా మోయించుకుంటే వారికి టిప్ లు ఇవ్వడం  కనీస దర్మం . అలాగే యాత్రలో ఎవరికేమైనా ఇబ్బంది ఎదురైతే టూర్ మేనేజర్ కు విడిగా వ్యక్తిగతంగా చెప్పాలి తప్పా యాత్రలో అందరి మూడ్ చెడిపోయేట్లు పెద్దగా అరవడం,గొడవ పెట్టడం చేయరాదు. ఇతరుల మూడ్ చెడగొట్టరాదు.మనం వెళ్ళేది పుణ్యక్షేత్రాల దైవ యాత్రకు కాని ఫంక్షన్ హాల్ కు కాదు దయచేసి అందరు గుర్తుంచుకోవాలి…
  • అందరు ఖచ్చితంగా 10 కిలోల బరువు దాటని ఒక్క బ్యాగ్ జిప్ ఉన్నది మాత్రమే తెచ్చుకోవాలి.కొందరు విడిచిన బట్టలు వేయడానికి మరో బ్యాగ్ తెచ్చుకుంటారు.అలా కాకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుంటే సరిపోతుంది.విడిచిన బట్టలు ఆ ప్లాస్టిక్ కవర్ లో వేసి ,అదే బ్యాగులో పెట్టుకోవాలి. చేతి కర్ర సంచులు ఎట్టి పరిస్తితుల్లోను అనుమతించబడవు. ఖచ్చితంగా జిప్ ఉన్న బ్యాగు- ఫ్యామిలికి ఒక బ్యాగు మాత్రమే తెచ్చుకోవాలి.మనం 3 ట్రైన్స్ మారాలి. ఫ్లాట్ ఫాంలు ఎక్కేప్పుడు దిగేప్పుడు ఎవరి లగేజి వారే మోసుకోవాలి కాబట్టి మీరు బుజాన మోయగలిగినంత లగేజి మాత్రమే  ఇబ్బంది పడకుండా తక్కువగా తెచ్చుకోండి.రిటర్న్ వచ్చేప్పుడు ఎలాగో షాపింగ్ చేయడం ద్వారా లగేజి బరువు పెరుగుతుంది కాబట్టి వీలైనంతగా తక్కువ లగేజి 10 కిలోలు దాటకుండా తెచ్చుకోండి.
  • 5 జతల బట్టలు, 1 బెడ్ షీటు, 1 టవల్ ,సోపు తెచ్చుకోండి. మగవాళ్ళు ఒక పంచె , (తెల్లటి) తెచ్చుకోండి. నాగేశ్వర జ్యోతిర్లింగంలో గర్భగుడిలో కూర్చుని అభిషేకం పూజలో పాల్గొనవచ్చును.(చార్జీలు ఉంటాయి అదనం)అలాగే అభిషేకం చేసుకోవడానికి ఒక చిన్న స్టీల్ లేదా రాగి  చెంబు వెంట తెచ్చుకోండి. స్ర్తీలు దీపారాదన చేయడానికి దీపం ప్రమిదలు, వత్తులు,ఆయిల్ తెచ్చుకుంటే అక్కడ వీలైన దేవాలయాల్లో ముట్టించుకోవచ్చును.
  •  కోవిడ్- జాగ్రత్తలు, మాస్క్ దరించడం, శానిటైజర్ తెచ్చుకోవడం అందరు పాటించాలి. వాక్సినేషన్ వేసుకున్న సర్టిఫికెట్లను అందరు డౌన్ లోడు చేసుకుని ప్రింట్ కాపీలను దగ్గర పెట్టుకోవాలి.(ఉంటే మంచిది లేకున్నా పర్వాలేదు.) కాని మాస్కులు,శానిటైజర్ మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి.
  • వేక్సిన్ సర్టిఫికెట్ మీదగ్గర లేకుంటే దాన్ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చునో ఈ లింక్ నొక్కి తెలుసుకోండి,ప్రింట్ తీసుకోండి.
  • https://shreetours.in/2022/03/03/how-to-get-covid-vaccine-certificate/
  • అలాగే మీ వెంట రెగ్యులర్ గా వాడుతున్న టాబ్లెట్స్,మెడిసిన్స్ ఎమున్నా తెచ్చుకోండి, విలువైన బంగారు అభరాణాలు ఎట్టిపరిస్తితుల్లో తెచ్చుకోవద్దు.మీ లగేజికి ట్రైన్ లో లాక్ చేయడానికి గొళుసులు,తాళం తెచ్చుకోండి.
  • మీ ఒరిజినల్ ఆధార్ కార్డును ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలి. అలాగే ఆధార్ కార్డు 3 జీరాక్స్ కాపీలను కూడ ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలి.
  • యాత్రలో ప్రతిరోజు టీ,టిఫిన్(మార్నింగ్ 1 టిఫిన్ లిమిటెడ్)మధ్యహ్నం మీల్స్ భోజనం,సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం బయటి హోటల్స్ లలో ఉంటుంది.చాలవరకు ప్రదేశాల్లో మేము రెగ్యులర్ గా వెళ్ళే హోటల్స్ లలో ముందుగానే ఫోన్ చేసి వెళుతాము.కొన్ని ప్లేసుల్లో స్పాట్ గా ఎక్కడ ఉంటే అక్కడ తింటాము. ఫుడ్ విషయంలో ఒక ముఖ్య విషయం ఏమంటే రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లెక్కన ఉండు అని. వెళ్ళే వారం రోజులు బయటి రాష్ట్రాల దేవాలయ దర్శనాలే కాకుండా అక్కడి సంస్క్రుతి,సంప్రాదాయం ,వంట అలవాట్లు అన్ని గమనించాలి.ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఎవరికైనా కూడా తమ జన్మ స్థలంలో చిన్నప్పటినుండి తినే ఫుడే మహా టేస్ట్ గా తోస్తుంది.వాస్తవం ఏమంటే అదొక అలవాటు మాత్రమే.మనం వెళ్ళేదగ్గర మద్నహ్న భోజనాలు దాదాపుగా మనం తినే మీల్స్ మాదిరిగానే అంతటా గుజరాత్,మద్యప్రదేశ్ లో దొరకుతుంది. కాని ఉదయం టిఫిన్ ఇడ్లి ,వడల బదులు వారి లోకల్ టిఫిన్స్(పోహా,డోక్లా,పరాట..) లబిస్తాయి.వారి టిఫిన్స్ ఓ నాలుగు రోజులు మనం కూడా తిని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మన యాత్ర అంతా చాలా ఆనందకరంగా సాగుతుంది.ఫుడ్ బాగాలేదు అనే ఫీలింగ్తో ఉండేవారికి, మేం అరెంజ్ చేసే ఫుడ్ నచ్చని వారికి డైలి రూ.300చొప్పున యాత్రలో ఉన్నన్ని రోజులు (టీ , టిఫిన్,భోజనం,రాత్రి అల్పాహారం కోసం) రిఫండ్ పేచేస్తాం,దాంతో హోటల్లో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును.మినరల్ వాటర్ బాటిల్ కావల్సిన వారు విడిగా కొనుక్కోవాలి.
  •  అలాగే   వెహికిల్ లో కూర్చుని జర్నీ చేసేప్పుడు కూడా మనం తదుపరి వెళ్ళే ప్రదేశం ఇంకా ఎప్పుడు వస్తుంది , ఎన్ని గంటలకు వస్తుంది అని ఎదురు చూడడం కాకుండా మనం యాత్రలో తిరిగే ప్రతి  క్షణం , మన వెళుతుంటే పక్కన కనపడే పక్రుతి, కొండలు,వాగులు,నదులు అన్నింటిని చూస్తు ఎంజాయ్ చేయాలి.ఒక్కసారి వెళ్ళి చూసిన ప్రదేశం మళ్ళి జన్మలో వెళుతామో వెళ్ళమో తెలియదు. కాబట్టి పుణ్యక్షేత్రాల దర్శనమే కాదు వెహికిల్ లో జర్నీ చేస్తున్న ప్రదేశాలన్నింటి చూస్తు ఎంజా య్ చేసే మూడ్ తో ఉండాలి.
  • వెహికిల్ లో అందరు డైలి 1లేదా 2 వరుసల చొప్పున వెనక్కి  జరగాలి.అందరికి వెహికిల్ లో రొటోషన్ పద్దతిలో సీట్లు మారుతాయి.యాత్రికులు అలా జరుగకుండా గొడవపడితే మర్నాటి నుండి ఉదయం ఎవరు ముందుగా టెంపో,బస్ ఎక్కితే వారికి ఆరోజంతా అదే సీట్లో కూర్చోవాలి..
  • 6)యాత్ర దర్శన సమయాల్లో వాతావరణం, పక్రుతి,ట్రాఫిక్ జాంలు,బంద్ లు ఇతర అనివార్య కారణాలతో కొన్ని ప్రదేశాలకు దర్శించకపోవడం జరిగవచ్చును. అప్పుడు సంధర్బానుసారంగా అందరి సౌకర్యం కోసం టూర్ ఆపరేటర్ తీసుకునే  నిర్ణయమే అంతిమం.ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.ఎట్టి పరిస్థితుల్లోను  రిటర్న్ ట్రైన్ టైంకు 1 గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని గమనించండి. టూర్ ఆపరేటర్ ప్రాధమిక విధి మీకు యాత్ర సమయంలో అన్ని రకాలుగా ఫ్లైట్,బస్,ట్రైన్,హోట్ ల్ రూంలు,టీ,టిఫిన్,భోజన సదుపాయలు ఏర్పరచడం,అన్ని పుణ్యక్షేత్రాలదర్శనానికి మిమ్మల్ని సౌకర్యవంతంగా తీసుకెళ్ళడం  అని దయచేసి మర్చిపోవద్దు.
  • ఏ రోజున ఏమేం చూస్తాం అని ఒక రోజు ముందు చెప్పుకుంటాం,అదేరోజు ఉదయం కూడా ఆరోజు ఏంచూస్తామో వెహికిల్ లోనే చెపుతాను.అంతే తప్ప దాన్ని పదిసార్లు అడిగిందే అడుగరాదు..

పూర్తి పరమేశ్వరుని దీవెనలు ఆశిస్సులు అందాలని మన యాత్ర అందరికి ఆనందంగా పూర్తికావాలని ఆ పరమేశ్వరుడుని వేడుకుంటూ…

ఓం నమశ్శివాయ.. రవీందర్.శ్రీటూర్స్. 8985246542

మా ఇతర యాత్రల వివరాల కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. https://shreetours.in/