వైష్ణోదేవి యాత్ర  ప్రయాణ సూచనలు-రవీందర్,శ్రీటూర్స్.8985246542

మీకు పంపిన ఫ్లైట్ టికెట్స్ లో ఉన్న ఫ్లైట్ టైం ప్రకారం  2 లేదా 2.30 గంటల ముందే ఖచ్చితంగా ఏయిర్ పోర్టుకు చేరుకోవాలి. అంతా ఉదయం ఇంటిదగ్గర స్నానం చేసే బయలుదేరాలి. అంతకు ముందురోజు రాత్రే మర్నాడు ఫ్లైట్ లో తినడానికి 2 చపాతీలు లాంటివి మీ హ్యాండు బ్యాగులో పెట్టుకోండి. మధ్యహ్నం లంచ్ నుండి మాత్రమే మా భోజన ఏర్పాట్లు ఉంటాయని గమనించగలరు. వైష్ణోదేవిలో కొండ ఎక్కేముందు లేడిస్ కు గుర్రం మీద కూర్చున్నప్పుడు చుడిదార్ లేదా లెగిన్స్ సౌకర్యంగా ఉంటాయి. 4జతల బట్టలు లైట్ లగేజి పెట్టుకోండి.(ఎవరు మోయగలిగినంత వారు Less Luggage more Comfort ) టూత్ పేస్టు, బ్రష్, టవల్,సోపు, ఇతరాత్ర ఏవైనా షుగర్,బి.పి. తదితర మెడిసిన్ టాబ్లెట్లు పెట్టుకోండి. . అవసరం ఉన్నవారు స్వెటర్స్ తెచ్చుకోగలరు,.లేడీస్ చుడిదార్స్ కూడా ఒక జత తెచ్చుకోగలరు. వైష్ణోదేవి కొండపైకి వెళ్ళడానికి చుడిదార్స్ లేదా లెగిన్స్ సౌకర్యంగా ఉంటాయి. మొదటి రోజు అమ్రుత్ సర్ గోల్డెన్ టెంపుల్,వాఘబార్డర్ . నైట్ అమ్రుత్ సర్ లో హోటల్ రూం స్టే. 14వ తేధిన వైష్ణోదేవి కొండపైకి యాత్ర,అదే రోజు రాత్రి 11గంటలకు డిల్లికి రిటర్న్ ట్రైన్. 15న డిల్లి దర్శనం. రిటర్న్ ట్రైన్ దిగాక మధ్యహ్నం  రైల్వేస్టేషన్ బయట ఒకరికి రూ.200-300 చొప్పున హోటల్ రూంలో స్నానం కోసం చార్జ్ చేస్తారు. మీరు విడిగా ఆ చార్జీలు పేచేసి స్నానం చేయవచ్చును.(యాత్ర నియమాలు-నైట్ హోటల్ రూం స్టే లేని దగ్గర ప్రెషప్ చార్జీలు అదనం)చివరి రోజు డిల్లి చూసి హైదరాబాదుకు బై ఫ్లైట్ రిటర్న్ ప్రయాణం.**ముఖ్య గమనిక** యాత్రలో ఏరోజుకు ఆరోజు ఆరోజు చూసేవి చెప్పడం జరుగుతుంది….

********************

ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రముఖ క్షేత్రం వైష్ణోదేవి.దక్షిణాదిన తిరుమల బాలాజి మందిరం ఎంత రద్దిగా ఉంటుందో ఉత్తరాన వైష్ణోదేవి క్షేత్రం అంతే రద్దిగా ఉంటుంది. తెల్లవారు జామున 2గంటలు, సాయంత్రం 2గంటలు తప్ప 24గంటలు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. కొండ కింద బాన్ గంగా నుండి కొండ పైన భవన్ వరకు 13 కీలోమీటర్ల ఘాట్ ప్రయాణం ఉంటుంది. మద్యలో అధుక్ వారి పాయింట్ వస్తుంది. ఇదొక మిడిల్ సెంటర్ లాంటిది. కొత్త నడుకదారి కూడా ఇక్కడే వచ్చి కలుస్తుంది. కొండ కింది నుండి ఇక్కడి వరకు మరి ఏటవాలుగా ఉంటుంది.ఇక్కడి వరకు సగం దరలో గుర్రం ఎక్కి వచ్చిన తరువాత ఇక్కడి నుండి నడక ప్రయాణం 6.5 కి.మీ. సులభంగా మరి అంత ఎత్తుగా లేని కొత్త నడక దారి ఉంటుంది.ఈ కొత్త నడుక దారిలో సులభంగా నడువవచ్చు. వ్రుద్దులకు,స్ర్త్రీలకు ఇక్కడి నుండి బ్యాటిరి ఆటోలు కూడా నడుస్తుంటాయి. కాని ఆ ఆటోలు కంటిన్యూ గా కాకుండా 2గంటల టైమ్ గ్యాప్ తో నడుస్తుంటాయి. మీరు వైష్ణోదేవి ప్రయాణం పెట్టుకుంటే శ్రీటూర్స్ తరుపున వైష్ణోదేవి టూర్ ప్రయాణంలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోందాం.దాదాపు ఇవే సలహాలు సూచనలు అన్ని టూర్లకు వర్తిస్తాయి.అందుకే ఒక టూర్ గురించి తెలుసుకుంటే అన్ని టూర్లకు ఇవే సలహాలు పాటించవచ్చును..
మీరు టూర్ కు వచ్చేప్పుడు విలువైన బంగారు అభరణాలు ఏవి తెచ్చుకోవద్దు,ఇంట్లో పెట్టుకుని రాగలరు, మీరెగ్యులర్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నట్లయితే మర్చిపోకుండా తెచ్చుకోండి. లగేజి,బట్టల జాగ్రత్తలు.. విదేశాలకు వెళ్ళేమాదరి పెద్ద పెద్ద బ్యాగులు, హెవి సూట్ కేసులు తెచ్చుకోకుండా లైట్ లగేజి 10 కిలోలు దాటకుండా తెచ్చుకోవాలి. ప్రయాణంలో బస్ నుండి హోటల్ రూంకువెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు , మద్యలో రైల్వే ప్రయాణంలో ఫ్లాట్ ఫాం మీదకు వెళ్ళేప్పడు వచ్చేప్పుడు, ప్రతిసారి ఎవరి లగేజి వారే ఖచ్చితంగా మోసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.బ్యాగులో ఖాళి ఉంచుకోవడం ద్వారా మద్యలో ఏదైనా షాపింగ్ చేసినకూడా సర్దుకోవచ్చు. ఏదైనా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుని విడిచిన బట్టలను ఆ కవర్ లో వేసుకుంటే సులభంగా ఉంటుంది.ఈ విషయంలో క్లారిటి లేకుండా కేవలం విడిచిన బట్టలకోసమని రెండవ బ్యాగు తెచ్చుకునేవారుంటారు,ఇది అనసవర ప్రయాస. కొద్ది రోజుల టూర్ లో కేవలం 4 జతల బట్టలు తెచ్చుకుంటే చాలు.దాంతో టవల్,సోప్స్,బ్రష్,టూత్ పేస్టు లాంటి మినిమం లగేజి…
వైష్ణోదేవి యాత్ర , జమ్ము కాశ్మీర్ లోని కాత్ర కొండదిగువన  బేస్ పాయింట్ అయిన‘బాన్ గంగా‘ నుండి మొదలవుతుంది.(తిరుమల నడుకదారిలో వెళ్ళేవారికి అలిపిరి మాదిరిగా) మీరు బాన్ గంగా చేరుకోవడానికి ముందే బస్టాండు లో ‘‘యాత్రా పర్చి’’ తీసుకోవాలి.యాత్ర పూర్తయి కొండ కిందికి వచ్చేవరకు ఈ యాత్ర పర్చి లేదా టికెట్ ను మీవెంటనే ఉంచుకోవాలి. ఈ యాత్ర పర్చి తీసుకున్న తరువాత 6గంటల లోపుగా కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాలి. అందుకే మీరు ఎప్పుడు కొండపైకి వెళ్ళదలుచుకుంటే అంతకు 6,7 గంటల ముందు మాత్రమే తీసుకోండి. కాత్రలో హోటల్ రూం లోనుండి బయలు దేరి బాన్ గంగా వెళ్ళేలోగానే మద్యలోనే బస్టాండులో యాత్ర పర్చి తీసి పెట్టుకోండి.తరువాత బాన్ గంగాలో ఎంట్రెన్ గేట్ దగ్గర ఈ యాత్ర పర్చీలను స్కాన్ చేయించి స్టాంప్ వేయించుకోవాలి.

బాన్ గంగాలో ఈ ఎంట్రెన్స్ గేట్ పక్కనుండే గుర్రాలు (రూ.1500-2000 సింగిల్ జర్నీ,అప్ డౌన్ రూ.3000-4000) డొలి లేదా పాల్కి (రూ.3000-4000సింగిల్ జర్నీ అప్ డౌన్ రూ.6000-8000) దొరకుతాయి.మీరు గుర్రం ఎక్కుతారా డోలి ఎక్కుతారా లేదా నడుస్తారా ముందే నిర్ణయించు కుని అప్రకారంగా మీ ప్రయాణం మొదలుపెట్టండి.నడక నడిస్తే 14కీ.మీ.దూరానికి సాదారణంగా ఉండే ఒక ఆరోగ్యవంతుడికి 6గంటలు పడుతుంది.దానిని బట్టి మీరు లెక్కవేసుకోండి నడవాలా గుర్రం ఎక్కాలా అని. గుర్రంలేదా డోలి ఎక్కదలుచుకుంటే అప్పటికే అక్కడున్న బోలెడంతమంది మీవెంట పడుతూ మీ మెడలో వారి ఐడెంటిటికార్డ్ ను వేయడానికి ప్రయత్నిస్తుంటారు.ఆ ఐ.డి.కార్డు,వారితోపాటు పక్కకు వెలితే అక్కడ ప్రీపేయిడ్ కౌంటర్లో అడ్వాన్సుగా డబ్బులు కట్టి మీ ప్రయాణం వారివెంట మొదలుపెట్టవచ్చు.మీరు ప్రీపేయిడ్ కౌంటర్ లో కట్టిన డబ్బు వారు కొండదిగి వచ్చాక వారికి ఇస్తారు. ఈ టికెట్ డబ్బులు కాకుండా వారికి మద్యలో టీ ,టిఫిన్స్ మరియు యాత్ర పూర్తయ్యాక టిప్ ఇవ్వడం ఇక్కడ కామన్ గా జరుగుతుంది. 6.5 కీలోమీటర్లు దూరం వెళ్ళాక మద్యలో ‘అధుక్ వారి‘ సెంటర్ వస్తుంది.ఇక్కడి నుండి సీనియర్ సిటిజన్స్ (60 పైన) కు బ్యాటరి ఆటోలు కూడా నడుస్తాయి.గంట రెండు గంటలు లైన్లో ఉండి టికెట్ తీసుకోవాలి. ‘బాన్ గంగా‘ నుండి గుర్రం లేదా డోలి ఈ పాయింట్ వరకే (అదుక్ వారి) మాట్లాడుకుని టికెట్ తీసుని, ఇక్కడినుండి కొండ పై వరకు (అంటే వైష్ణోదేవి టెంపుల్ ఏరియా ‘భవన్‘ వరకు) ఈ బ్యాటరి ఆటోలు నడుస్తాయి,రిటర్న్ లో కూడా సీనియర్ సిటిజన్స్ ఇక్కడి వరకు(అదుక్ వారి సెంటర్ పాయింట్) బ్యాటరి ఆటోలో వచ్చి (బ్యాటరి ఆటో అప్ డౌన్ రూ.700) , నుండి కిందకు బాన్ గంగా వరకు తిరిగి గుర్రం,లేదా డోలిలో వెళ్ళవచ్చును. కాట్రా నుండి వచ్చిన హెలికాప్టర్ ఇక్కడ సాంజి చాత్ వరకు మిమ్మల్ని దింపుతాయి.సాంజి చాత్ నుండి భవన్ (అమ్మవారి టెంపుల్ ఏరియా) మరో 2.3 కిలోమీటర్లు ఉంటుంది.హెలిపాడ్ నుండి మీరు నడక దారిన కాని లేదా గుర్రం లేదా డోలిమీదుగా కాని వెళ్ళవచ్చును. మీరు వీటిల్లో దేంట్లో వచ్చిన భవన్ వరకు మాత్రమే వస్తాయి. ఎండాకాలం పెద్దగా చలేం ఉండదు కామన్ డ్రెస్సింగ్ తో రావచ్చు,షూలు, స్వెట్టర్లు అవసరం లేదు. చలి కాలం మాత్రం అవి తప్పనిసరిగా వేసుకుని రావాలి.కొండమీద భవన్ ఏరియా 3200 మీటర్ల ఎత్తులో ఉంటుంది.జనవరి నుండి మార్చి వరకు చూస్తే చుట్టు కొండల మీద అహ్లాదంగా మంచుపేరకుని కనపడుతుంది.
సాయంత్రం 5లోపు మీరు అమ్మవారి దర్శనానికి గేటులోపలికి వెళ్ళాలి.లేదంటే సాయంత్రం 2,3గంటలు, తెల్లవారు ఝామున 2,3గంటలు దర్శనం ఆపివేస్తారు.అమ్మవారి దర్శనానికి వెళ్ళేముందు లగేజి కౌంటర్లో మీహాండ్ బ్యాగ్ ,పెన్, బెల్ట్, దువ్వెన,అగ్గిపెట్టె,సిగిరెట్ ,మొబైల్ ఫోన్ , పవర్ బ్యాంకులు లాంటివి ఏమున్నా లగేజిలో పెట్టుకొని లగేజి కౌంటర్ లో పెట్టుకోండి. కొండమీద భవన్ దగ్గర లగేజి కౌంటర్లు 2 చోట్ల ఉంటాయి.అక్కడ మీకే లగేజి బాక్స్ కీస్ కూడా ఇస్తారు.మీరు మీ లగేజిని ఆ బాక్సలో పెట్టకుని లాక్ చేసి తాళం చెవి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఇక లైన్ ల నిలబడే ముందు ఎడమ వైపు కనపడే చెప్పుల కౌంటర్ లో చెప్పులు వదిలి లైన్ లో నిలబడండి. లగేజి కౌంటర్ లో లగేజి ఎక్కడ పెట్టాము, చెప్పులు ఎక్కడ పెట్టాము అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి.లైన్ లో నిలబడ్డ తరువాత మరో 500మీటర్లు నడక దారిలో ముందుకు వెళ్ళాలి.కొన్ని మెట్లు కూడా మద్య మద్యలో వస్తూంటాయి. పూర్తిగా పైకి ఎక్కిన తరువాత లోన రెండు గుహల గుండా లోపలికి పంపిస్తారు.లోనకు వెళ్ళిన తరువాత అక్కడ అద్రుశ్య రూపిణిగా ఉన్న అమ్మవారు దర్శనమిస్తారు.అద్రుశ్యంగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అంటే కొంచెం గందరగోళం ఉంటుంది అందుకే అక్కడ అమ్మవారు పిండీల రూపంలో కాళిగా,సరస్వతిగా,దుర్గగా..దర్శనమిస్తారు.నిశ్శబ్దంగా అమ్మవారిని దర్శించుకుని మీ మనసులోని కొరికను అమ్మవారికి నివేదించండి. సహేతుకమైన కొరికలు ఏడాదిలో లోపే తీరడం వెళ్ళివచ్చిన చాలామంది భక్తులకు అనుభవం.రిక్త హస్తాలతో తన నిజమైన భక్తులను ఏనాటికి పంపదని ఇక్కడ ప్రాచుర్యం.
అమ్మవారిని దర్శించుకున్నతరువాత గుహనుండి బయటకు వచ్చేప్పుడు అక్కడ చిన్న ప్రసాధం పెడుతారు.ఆ ప్రసాదాన్ని స్వీకరించి బయట మాతా వైష్ణోదేవి టెంపుల్ ట్రస్ట్ భోజనశాలల్లో తగ్గింపు రేట్లకే మీకు ఆహార పధార్థాలు దొరకుతాయి. రాజ్మా చావల్ రూ.40, సాంబర్ వడ, 25 రుపాయలు, టీ.7 రుపాయలు ఇలా..ఇక్కడ ప్రైవేటు హోటల్లు కూడా ఉంటాయి.
ఫుడ్ తిన్న తరువాత ఇక్కడే దగ్గర ఉన్న బైరవ టెంపుల్ కు వెళ్ళండి. సాయంత్రం 5లోపు రోప్ వే సర్వీస్ ఉంటుంది. అప్ డౌన్ రూ.200 చార్జి ఉంటుంది.టూవే టికెట్ తీసుకోవచ్చు.లేదా సింగిల్ టికెట్ తీసుకుని బైరవటెంపుల్ నుండే డైరెక్టుగా రిటర్న్ జర్నీ కోసం సాంజీచాత్ హెలిపాడ్ కు వెళ్ళవచ్చును. బైరవ టెంపుల్ నుండి రిటర్న్ జర్నీ కోసం సాంజి చాత్ వరకు కాని కొండ కింది బాన్ గంగా వరకు కాని గుర్రాలు దొరకుతాయి.లేదా మిడిల్ పాయింట్ అదుక్ వారి వరకు వెళ్ళవచ్చును. లేదా భవన్ ఏరియాకు రోప్ వేలోనే రిటర్న్ వెళ్ళి అక్కడి నుండి బ్యాటరి ఆటోలో (స్ర్తీలకు,వ్రుద్దులకు) అధుక్ వారి వరకు వెళ్ళవచ్చును.(ఆటోలు చాలా లిమిటెడ్ గా కొన్ని మాత్రమే నడుస్తాయి.) లేదంటే రోప్ వేలో రిటర్న్ వచ్చి భవన్ నుండి అధుక్ వారి వరకు నడిచి తరువాత అదుక్ వారి నుండి కిందా బాన్ గంగా వరకు గుర్రం ఎక్కవచ్చును. మీరు పూర్తిగా నడిచే కొండదిగితే బాన్ గంగా దగర్లో చాలా షాపులు కనపడుతుంటాయి.అక్కడమీకు కాళ్ళకు మసాజ్ చేసే పార్లర్ ల దగ్గరనుండి మొదలు కొని కాశ్మీర్ డ్రైఫ్రూట్స్ ,అక్రూట్స్ లాంటివి అమ్ముతుంటారు.షాపింగ్ చేసుకున్న తరువాత బాన్ గంగా నుండి రిటర్న్ కాట్రలో మీ హోటల్ రూంకి చేరుకోవడానికి ఆటోలు దొరకుతాయి. రిటర్న్ వెళ్ళే దారి వేరే రూట్ లో వెళుతాయి.కాబట్టి ఆటోవాళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతున్నారని గభారపడవద్దు.
డాక్యుమెంట్స్..యాత్రకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరు తప్పని సరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకోవలెను.ఒరిజినల్ ఆధార్ తో పాటు 3 జిరాక్స్ కాపీలు కూడా తప్పనిసరిగా తెచ్చుకోవలెను(జిరాక్స్ కాపీలు హోటల్ రూం కోసం,)ఒరిజినల్ ఆదార్ కార్డ్ ఏయిర్ పోర్టులో సెక్యూరిటి చెకింగ్ కోసం,ట్రైన్ జర్నీ సమయంలో, తప్పని సరిగా దగ్గర ఉంచుకోవాలి. బస్ లో సీట్ల అరెంజ్ మెంట్. డైలి 1 వరుస సీటు చొప్పున ప్రతిరోజు వెనక్కి మారాలి అప్పడు అందరికి రోటేషన్ లో సీట్లు మారుతాయి.. ఫుణ్యక్షేత్రాల టూర్ కు వచ్చేవాళ్ళు 90శాతం సీనియర్ సిటిజన్స్ ఉంటారు.అందరు మాకు ముందు వరుసల్లోనే కావాలంటే ఏ టూర్ అపరేటర్ వలన కూడా ఇది సాధ్యం కాదు.దయచేసి కామన్ లాజిక్ తో అర్థం చేసుకుని సహకరించగలరు. కదలకుండా ఫిక్సడ్ ఫ్రంట్ సీట్ కావాలంటే కేవలం రూ.300తో రిజర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికో పోయి ఎవరికో సహయం చేయనవసరం లేదు,మీతోటి వారిక సహయం చేయగలిగితే ..మానవసేవయే మాధవ సేవ…అర్థం చేసుకున్నట్లయేతే సీట్ల దగ్గర చిన్నపిల్లల మాదిరి మనస్థత్త్వం మాయమవుతుంది.
టూర్ ఎంజాయ్ చేయడం. టూర్ లో ఉన్నప్పుడు చాలామంది చేసే పొరపాటు తరువాత వెళ్ళేప్రదేశం,టెంపుల్ ఎన్నిగంటల్లో ఎప్పటికి వెళుతాం అని అడుగుతుంటారు.ఏ టూర్ లో కూడా ఈ ఆలోచన దొరణికి పుల్ స్టాప్ పెట్టాల్సిందే.మనం వెళ్ళేప్రదేశం , చూస్తున్న ప్రదేశం భవిష్యత్తులో మళ్ళీ చూస్తారో చూడరో,వెళుతారో వెళ్ళరో , కాబట్టి ప్రతిక్షణం చూస్తున్న ప్రదేశం అక్కడి భౌగోళిక పరిస్థితులు,వాతవరణం,నధులు,వాగులు, వంకలు, రోడ్లు,పర్వతాలు, బిల్డింగులు ప్రతీది చూసి అనందించదగ్గదే అనిగుర్తుంచుకుంటే మీకు ప్రయాణం మధ్యలో ఎప్పుడు బోర్ కొట్టదు.మీరు టూర్ కు బయలుదేరి ఫ్లైట్ ఎక్కేముందే మీ సమస్యలు ఏమున్నా మూట కట్టి బయట విసిరి పారేయండి,ఏ యాత్ర చేసిన దాన్ని సంపూర్ణంగా ఆనందించండి.
ఫీడ్ బ్యాక్. కొంతమంది టూరిస్టులు టూర్ కు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా సర్ధుకపోకుండా గోడవపడుతుంటారు.మీ కామెంట్స్,గొడవ గ్రూప్ లో మిగితా గ్రూప్ సభ్యుల ఆనందాన్ని కూడా హరించి వేస్తాయి. ఇంట్లో నలుగురు పిల్లలతోని బయటకు వెళితేనే ఒక్కోక్కరు ఒక్కోటి మాట్లాడుతుంటారు.అలాంటిది పెద్ద గ్రూప్ తో బయటకు వెళ్ళినప్పుడు నాలుగు రకాల మనస్థత్వాలు ఉన్న కూడా సహనంతో ఓపిక పట్టి ఉండడం ముఖ్యం.

మరోసారి వైష్ణోదేవి కొండమీద చార్జీల వివరాలు..

అప్ డౌన్ గుర్రం మీద సుమారు రూ. 3000- 4000 , సింగిల్ వే రూ.1500- 2000

అప్ డౌన్ డోలి మీద (నలుగురు మోసేది ) రూ.6500- 8000 సింగిల్ వే రూ.3500- 4000

అప్ డౌన్ హెలికాప్టర్ మీద రూ.3500 ( కాట్ర టూ సాంజి చాత్ అప్ డౌన్, సింగిల్ వే రూ.1800)

బ్యాటరి అటో రూ.300 -350 (అదుక్ వారి (6.5 కి.మీ) టూ భవన్(0.5 కి.మీ.వైష్ణోమాత టెంపుల్ కు) , రిటర్న్ భవన్ టూ అధుక్ వారి విడివిడిగా చార్జీలు)

శ్రీటూర్స్ తరుపున మేము రెగ్యులర్ గా వైష్ణోదేవి యాత్రతో పాటు పంజాబ్,(అమ్రుత్ సర్ గోల్డెన్ టెంపుల్,) మరియు హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖి శక్తిపీఠం మరియు ఇతర కాంగ్రా వజ్రేశ్వరి దేవి, భగాలముఖి దేవి, ,చింతపూర్ణిమ దేవి ,డిల్లి అక్షరధామ్ దర్శనాలు ఈ యాత్రతో పాటు దర్శిస్తాము,, ఈ వెబ్ సైట్ లో ని హోం పేజి లోమా మా ఇతర యాత్ర ల వివరాల కోసం చూడండి.  థన్యవాధములు. www.shreetours.in  రవీందర్,శ్రీటూర్స్.  Mob. 8985246542